న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో భూకంపం (Earthquake) సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.15 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. థెంజాల్కు 73 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
కాగా, భారత్-మయన్మార్ సరిహద్దుల్లో భూమి కంపించిందని యూరోపియన్-మెడిటేరియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. శుక్రవారం ఉదయం 5.15 గంటలకు త్రిపుర, మణిపూర్, మిజోరాం, అసోంతోపాటు కోల్కతాలో కూడా భూ ప్రకంపణలు సంభవించాయని ప్రకటించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదయిందని వెల్లడించింది. భూకంప కేంద్రం బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్కు 183 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ఉదయం 5.15 గంటలకు మరోసారి భూమి కంపించిందని పేర్కొన్నది.