ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 4.3 లక్షలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 57,074 కరోనా కేసులు, 222 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,10,597కు, మరణాల సంఖ్య 55,878కు చేరింది.
అలాగే ముంబైలో ఆదివారం రికార్డుస్థాయిలో 11,163 కరోనా కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,52,445కు, మరణాల సంఖ్య 11,776కు పెరిగింది.
మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 27,508 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 25,22,823కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,30,823 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రలో రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ.. వారాంతాల్లో లాక్డౌన్
కరోనా ఎఫెక్ట్ : బీహార్లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్లో పాఠశాలల మూసివేత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!