Food Poisoning | ఓ ఆలయ జాతరలో ప్రసాదం తిని (eating prasad) సుమారు 50 మంది అస్వస్థతకు (Food Poisoning) గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రం బెలగావిలో బుధవారం చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెలగావిలోని హూలికట్టి గ్రామంలో ( Hoolikatti village) గల భీరేశ్వర్, కరెమ్మ ఆలయం వార్షికోత్సవం సందర్భంగా జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పంచిపెట్టిన ప్రసాదం తిని 50 మంది దాకా అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రసాదం తిన్న చాలా మంది కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడినట్లు చెప్పారు. వీరిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది మందిని ధార్వాడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెలగావి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫుడ్ పాయిజనింగా లేక మరేదైనా కారణామా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు బెలగావి ఎస్పీ బాబాసాబ్ నేమాగౌడ్ తెలిపారు.
Also Read..
Gold Seized | ముంబై విమానాశ్రయంలో 11 కిలోల బంగారం స్వాధీనం
Arvind Kejriwal | స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు
Mexico | మెక్సికో అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ర్యాలీలో కూలిన వేదిక.. ఐదుగురు మృతి