Arvind Kejriwal | అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలో జరిగిన దాడి ఘటన (Assult Case) తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడంటూ స్వాతి ఆరోపిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిభవ్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు.
అయితే, ఈ కేసులో కేజ్రీవాల్ తల్లిదండ్రులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం 11:30 గంటల సమయంలో ఢిల్లీ పోలీసులు సివిల్ లైన్స్ ప్రాంతంలోని సీఎం నివాసానికి చేరుకొని కేజ్రీ తల్లిదండ్రులను ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో సీఎం తల్లిదండ్రులతోపాటు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ నుంచి కూడా వాంగ్మూలం తీసుకోనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు స్వాతి మలివాల్ మీద దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తొలిసారి స్పందించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ అంశం విచారణ దశలో ఉన్నందున తాను స్పందిస్తే విచారణపై ప్రభావం పడుతుందని అన్నారు. యితే, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని, న్యాయం చేయాలని మాత్రం తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రెండు రకాల వాదనలు ఉన్నందున పోలీసులు ఇరువైపుల వాదనలపై విచారణ జరిపి, న్యాయం చేయాలని పేర్కొన్నారు.
Also Read..
Nikki Haley | అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు ట్రంప్కే.. స్పష్టం చేసిన నిక్కీ హేలీ
Rishi Sunak | జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు
Budda Purnima Wishes | దేశ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు