Gold Seized | ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో (Mumbai Airport) భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized). విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.7 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు (Mumbai Customs) స్వాధీనం చేసుకున్నారు.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో మొత్తం 24 కేసుల్లో 11.40 కిలోల బంగారం పట్టుబడింది. వీటితోపాటు పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం, వస్తువుల విలువ రూ.7.46 కోట్లుగా అంచనా. బట్టలు, శానిటరీ ప్యాడ్స్, ట్రాలీ, లోదుస్తులు వంటి ఇతర ప్రదేశాల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Mumbai Customs seized over 11.40 Kg Gold & Electronics totally valued at Rs. 7.46 Cr across 24 cases. Gold was found concealed inside clothes, sanitary pad, trolly, undergarments and inside and on the body of the passengers. Two passengers were arrested. pic.twitter.com/Cb0MdRvHC4
— ANI (@ANI) May 23, 2024
Also Read..
Mexico | మెక్సికో అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ర్యాలీలో కూలిన వేదిక.. ఐదుగురు మృతి
Arvind Kejriwal | స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు
Nikki Haley | అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు ట్రంప్కే.. స్పష్టం చేసిన నిక్కీ హేలీ