Road Accident | ఝార్ఖండ్ (Jharkhand)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Road Accident). ఎస్యూవీ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిధి జిల్లా (Giridih district)లోని బాగ్మారాలో గల ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
థోరియా గ్రామానికి (Thoria village) చెందిన కొందరు టికోడిహ్లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది (Car Hits Tree). ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. అందులో ఐదు గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా మరో ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు గిరిధి సదర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి అనిల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Sabarimala Temple | శబరిమలకు పోటెత్తిన భక్తులు
Naga Chaitanya | సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాగచైతన్య
Mohammed Shami | షమీ ఓ మంచి ఆటగాడిలానే.. మంచి భర్త అయ్యుంటే బాగుండేది : మాజీ భార్య సంచలన కామెంట్స్