Earthquake | సిమ్లా : హిమాచల్ప్రదేశ్లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. చంబా పట్టణంతో పాటు 100 కిలోమీటర్ల దూరంలోని మనాలీలోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైటనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి 9:34 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. మనాలీలో ఏడు సెకన్ల పాటు భూమి కంపించింది. పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భయంతో తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే చంబాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Earthquake of Magnitude:5.3, Occurred on 04-04-2024, 21:34:32 IST, Lat: 33.09 & Long: 76.59, Depth: 10 Km ,Location:Chamba, Himachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/SYNmt1ew5B @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia… pic.twitter.com/Bc2FRprnWw
— National Center for Seismology (@NCS_Earthquake) April 4, 2024