Rajya Sabha | రాజ్యసభలో నుంచి 46 మంది ఎంపీలను చైర్మన్ జగ్దీప్ ధంకర్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాల వరకు ఈ సస్పెన్షన్ విధించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తుండడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగడంతో స్తంభించిపోతున్నాయి. ఈ క్రమంలో పలుసార్లు ఇవాళ సభను చైర్మన్ వాయిదా వేశారు. సభ్యులను సర్ది చెప్పినా వినకపోవడంతో సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం 79 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. లోక్సభలో ఇవాళ 33 మంది సభ్యులను సస్పెండ్ అయ్యారు. ఇందులో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే నుంచి టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్తో సహా మొత్తం 33 మంది విపక్ష సభ్యులు సోమవారం లోక్సభ నుంచి సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ శీతాకాల సమావేశాల వరకు 30 మంది సభ్యులు సస్పెండ్ చేయగా.. మరో ముగ్గురు సభ్యులను ప్రివిలేజెస్ కమిటీ నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ను ఎదుర్కోనున్నారు. కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలేఖ్ ముగ్గురు స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేయడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సస్పెన్షన్కు సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటు సహాయంతో ఆమోదించారు. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు.