న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లతోపాటు 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ తన క్యాబినెట్ను విస్తరించినట్లు తెలుస్తున్నది. ఏడుగురు సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారు. వారిలో హై ప్రొఫైల్ మంత్రులు నలుగురు ఉన్నారు.
కొత్తగా 36 మంది మోదీ క్యాబినెట్లో మంత్రులుగా చేరారు. కరోనా రెండో వేవ్ను ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ విఫలమైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తన క్యాబినెట్ను పూర్తిగా ప్రక్షాళన చేశారు.
నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో కలిసి మొత్తం మోదీ క్యాబినెట్లో 77 మంది మంత్రులు ఉన్నారు. వారిలో దాదాపు సగం కొత్త ముఖాలే కావడం గమనార్హం.
అనురాగ్ సింగ్ ఠాకూర్, హర్దీప్ సింగ్ పూరీతోపాటు 15 మంది నూతన క్యాబినెట్ మంత్రులుగా పని చేశారు. అనురాగ్ సింగ్ ఠాకూర్.. ఇంతకుముందు ఆర్థికశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్కు ప్రమోషన్ కల్పించారు మోదీ.
ఇప్పటి వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించిన హర్దీప్ సింగ్ పూరీకి ప్రమోషన్ కల్పించారు. ఈ శాఖ పనితీరులో మెరుగ్గా వ్యవహరించినందుకు ఆయనకు పదోన్నతి లభించింది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం మరో కారణం.
ఇంకా కొత్త క్యాబినెట్ మంత్రులుగా శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, నారాయణ రాణె, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్ కూడా ప్రమాణం చేశారు.
భారీగా కేంద్ర క్యాబినెట్లో మార్పులు చేసినా కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజీనామా చేశారు. నూతన మంత్రుల ప్రమాణం కంటే వీరి రాజీనామాలే ప్రధాన చర్చగా మారాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా హర్షవర్దన్.. కరోనా రెండో వేవ్ను నియంత్రించడంలో విఫలం అయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్య రంగ మౌలిక వసతుల లేమి, ఆక్సిజన్ లేక వివిధ నగరాల్లోని దవాఖానాల్లో రోగుల ఆర్తనాదాలు విమర్శలకు దారి తీశాయి
మరోవైపు కోవిడ్-19తో మరణించిన వారికి శ్మశాన వాటికలో దహనం, నదుల్లో మ్రుతదేహాలు పోటెత్తడంతో అసాధారణ జాతీయ సంక్షోభానికి దారి తీసింది. ఈ పరిణామాలు హర్ష వర్దన్ రాజీనామాకు దారి తీశాయి.
కేంద్ర పర్యావరణశాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్.. మరోవైపు క్యాబినెట్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ వచ్చారు. రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ట్రబుల్ షూటర్ల కోర్ టీంలో చేర్చుకునే అవకాశం ఉంది.
ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్లు ఇంతకుముందు ఏబీ వాజపేయి క్యాబినెట్లో మంత్రులుగా పని చేసిన వారే. కొత్త ఐటీ రూల్స్ అమలు విషయంలో సోషల్ మీడియా సంస్థలతో రవిశంకర్ ప్రసాద్ చట్టపరంగా ఘర్షణకు దిగారు.
ఇక ట్విట్టర్తో రవిశంకర్ ప్రసాద్ నిరంతరం వివాదంలో చిక్కుకున్నారు. రవిశంకర్ ప్రసాద్, జవదేకర్, హర్షవర్దన్ బుధవారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. 20 శాతం మంది మంత్రులను పనితీరు ఆధారంగా తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అక్కడ… సగానికి సగం తగ్గిన ఈ-వెహికల్స్ ధరలు.. ఎందుకంటే..?
హైదరాబాద్ రియల్టీలోకి వారెన్ బఫెట్
అక్కడ… సగానికి సగం తగ్గిన ఈ-వెహికల్స్ ధరలు.. ఎందుకంటే..?
మలబార్ గోల్డ్లో 5వేల ఉద్యోగాలు