ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో గత ఐదు నెలలుగా అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం అదనంగా 400 మంది బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించింది. సీ 130జే, ఏ 321 ఎయిర్క్రాఫ్ట్లలో వీరిని తరలించినట్టు హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది.
మరోవైపు ఎడిటర్స్ గిల్డ్ సభ్యులకు మణిపూర్ జర్నలిస్ట్ యూనియన్ లీగల్ నోటీసులు పంపింది. మణిపూర్లో ఓ వర్గానికి మద్దతుగా మీడియా ప్రచారం సాగుతున్నదని ఎడిటర్స్ గిల్డ్ ఇటీవల నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా నోటీసులు జారీ అయ్యాయి. ఎడిటర్స్ గిల్డ్ నివేదిక ఉద్రిక్తతలను మరింత పెంచిందని నోటీసుల్లో ఆరోపించారు.