Building Collapse | ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో మంగళవారం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఉత్తర భారతంలో ఉదయం నుంచి భూకంపం సంభవించడంతో లక్నలో ఈ భవనం కుప్పకూలినట్లు తెలుస్తున్నది. ఈ భవన శిధిలాల కింద భారీగా ప్రజలు చిక్కుపడి పోయి ఉంటారని భావిస్తున్నారు.
భవనం కుప్పకూలిన సంగతి తెలియగానే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భూకంపం వల్ల భవనం బలహీన పడిపోయి కుప్పకూలిందా అన్న సంగతిపై ఆరా తీస్తున్నారు. ఈ భవనం కింద నాలుగు కుటుంబాలు జీవిస్తున్నట్లు భావిస్తున్నారు. లక్నోలోని హజ్రత్గంజ్ వద్ద ఈ భవనం ఉంది. ఇప్పటి వరకు భవన శిధిలాల నుంచి ముగ్గురిని వెలికి తీశారు.
హజ్రత్గంజ్ ప్రాంతం పలు పాత భవనాలకు నిలయంగా మారింది. అటువంటి వాటిని అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో పేరొందిన అలయా అపార్ట్మెంట్స్లో ఒక భవనం కుప్పకూలింది. ఘటనా స్థలాన్ని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ సందర్శించారు. సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర ప్రకృతి విపత్తు నివారణ సంస్థల అధికారులు, సిబ్బంది సహాయ చర్యల్లో నిమగ్నం అయ్యారు.