ముంబై : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుంటే కేరళలో మహమ్మారి విజృంభణ ఆందోళన రేకెత్తిస్తోంది. కేరళలో కరోనా కేసులు అనూహ్యంగా పెరగడం థర్డ్వేవ్ ప్రారంభానికి సంకేతంగా చూడాలని మహారాష్ట్ర హోంమంత్రి రాజేష్ తోప్ బుధవారం పేర్కొన్నారు. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోందని చెప్పారు. థర్డ్వేవ్ తలెత్తితే కట్టడి చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఆక్సిజన్, పడకలు, వైద్య సిబ్బంది, ప్రాణాధార ఔషధాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఐసీఎంఆర్, ప్రభుత్వ సూచనలతో పీడియాట్రిక్స్ విభాగంలోనూ ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు. ఇక మహారాష్ట్రలో తాజాగా 6258 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మహమ్మారితో బాధపడుతూ గడిచిన 24 గంటల్లో 254 మంది ప్రాణాలు కోల్పోయారు.