Fire Incidents | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇటీవలే వరుస అగ్నిప్రమాద ఘటనలు (Fire Incidents) చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వేల సంఖ్యలో ఫైర్ ఇన్సిడెంట్ ఘటనలు జరిగాయి. మొత్తంగా ఈ రెండున్నర నెలల్లోనే అగ్ని ప్రమాద ఘటనల కారణంగా 39 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. సుమారు 100 మందికిపైగానే ప్రజలు గాయపడినట్లు తెలిపారు.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ (Delhi Fire Services) వెల్లడించిన డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి 14 వరకూ రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,682 అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకూ మొత్తం 39 మంది మరణించారు. అందులో జనవరి నెలలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనల్లో 16 మంది, ఫిబ్రవరిలో 16, మార్చి (14వ తేదీ వరకూ)లో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఈ అగ్నిప్రమాదాల్లో మొత్తం 107 మందికి గాయపడ్డారు. జనవరిలో 51 మంది, ఫిబ్రవరిలో 42, మార్చి (14వ తేదీ వరకూ)లో 14 మంది గాయపడ్డారు.
Also Read..
Mamata Banerjee | నుదుటిపై మూడు కుట్లు.. నిలకడగానే దీదీ ఆరోగ్యం : అధికారులు
Earthquaken | జపాన్లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 5.8 తీవ్రతతో బలమైన ప్రకంపనలు
Election Commissioners | ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్బీర్, జ్ఞానేశ్