Jammu Kashmir | జమ్ముకశ్మీర్ లోని ఉగ్రవాద మూకలు మరోమారు రెచ్చిపోయాయి. షోపియా జిల్లాలోని గగ్రాన్ ప్రాంతంలో పని చేస్తున్న ముగ్గురు వలస కార్మికులపై ఇద్దరు మాస్కులు ధరించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.వారికి షోపియాన్ జిల్లా దవాఖానలో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్లోని ఎస్ఎంహెచ్ఎస్ దవాఖానకు తరలించారు.
బాధితుల్ని అన్మోల్ కుమార్, హీరాలాల్ యాదవ్, పింటూ కుమార్ ఠాకూర్గా గుర్తించినట్లు పోలీసులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. బాధితులు ముగ్గురు బీహార్ వాసులేనని పేర్కొన్నారు. కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పోలీసులు, భద్రతా బలగాలు తమ స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.