న్యూఢిల్లీ : జీఎస్టీ చట్టంలో తీసుకొచ్చిన సవరణలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధింపు ఆదివారం(అక్టోబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది. జీఎస్టీ సవరణ బిల్లును ఆగస్టులో లోక్సభలో ఆమోదింపజేసుకొన్నది.
ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించాలని జూలై 11న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర సర్కార్కు ప్రతిపాదనలు చేసింది.