చండీగఢ్: స్కూలు పైకప్పు కూలడంతో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. హర్యానాలోని సోన్పట్లో గురువారం ఈ ఘటన జరిగింది. గన్నౌర్లోని ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో తరగతిలోని విద్యార్థుల్లో 25 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే గన్నౌర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి సీరియస్గా ఉన్న ఐదుగురిని ఖాన్పూర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు కూడా గాయపడ్డారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల పరిస్థితిపై వారు ఆందోళన చెందారు. కాగా, స్కూల్ పైకప్పు కూలిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.