Indore Temple | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore)లో రామనవమి (Ram Navami) వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి (stepwell) పైకప్పు కూలి.. అందులో భక్తులు పడిపోయారు. పటేల్ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్ జులేలాల్ ఆలయంలో (Shree Beleshwar Mahadev Jhulelal Temple) గురువారం రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థలం లేక కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి (Stepwell)పై కూర్చున్నారు.
ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 25 మంది భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సహాయంతో బావిలో పడిపోయినవారిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
Also Read..
Suicide | తల్లిదండ్రులు చదువుకోమన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 ఏండ్ల బాలిక
Rahul Gandhi | ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి.. రాహుల్ అంశంపై జర్మనీ
Martin Cooper | మొబైల్ ఎలా వాడాలో ఇప్పటికీ నాకు తెలీదు.. సెల్ఫోన్ రూపకర్త మార్టిన్