న్యూఢిల్లీ : పంజాబ్కు చెందిన 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీతో టచ్లో ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నారు. అయితే, కాంగ్రెస్ చెత్తను తీసుకునేందుకు తాను ఇష్టపడడం లేదన్నారు. ఆప్ పంజాబ్ యూనిట్తో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఉన్నారా? అన్న ఆయనకు సమాధానం ఇవ్వకుండా.. చిరునవ్వులు చిందించారు. ‘కాంగ్రెస్కు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. కానీ, చెత్తను తీసుకోవడం ఇష్టపడడం లేదు.
వారిని పార్టీలోకి తీసుకోవడం మొదలు పెడితే ఇవాళ సాయంత్రానికి 25 మంది వచ్చి చేరుతారు. మరో ఇద్దరు ముగ్గురు ఎంపీలు వస్తారు. కానీ, నీచరాజకీయాలు చేయడం లేదు’ అని ఢిల్లీ సీఎం అన్నారు. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అయితే, తాను పంజాబ్లో సీఎం అభ్యర్థిని కాదని అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు శిరోమణి అకాలీధల్పై నిప్పులు చెరిగారు. పంజాబ్లో ప్రస్తుత ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యిందని విమర్శించారు.