ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 21,273 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 425 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 93.02%గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,01,041 యాక్టివ్ కొవిడ్-19 కేసులు ఉన్నాయి. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 92,225కు చేరింది. మరోవైపు ముంబైలో కొత్తగా 1,266 మంది వైరస్ సోకినట్లు తేలింది. నగరంలో మరో 36 మంది మృతిచెందారు.