Cold Wave | దేశంలో చలితీవ్రత (Cold Wave) పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై (North India) చలి పంజా విసురుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలికి తోడు ఆయా రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. చల్లటి వాతావరణానికి తోడు రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ మంచు (Dense fog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు (Trains Delayed) అధికారులు తెలిపారు.
20 trains arriving late in Delhi area today, on 8th January due to fog in several parts of India. pic.twitter.com/oUKGJlQXxw
— ANI (@ANI) January 8, 2024
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
మరోవైపు రాబోయే రోజుల్లో ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్ర పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ‘రాబోయే రెండు రోజుల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్లలో కోల్డ్ డే నుండి తీవ్రమైన కోల్డ్ డే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది’ అని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా జనవరి 8 – 10 మధ్య రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఉరుములతో కూడి వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
#WATCH | Delhi continues to be wrapped in a layer of fog.
(Drone visuals from Barapullah Flyover area, shot at 7:50 am today) pic.twitter.com/qPqJaFQjIj
— ANI (@ANI) January 8, 2024
పాఠశాలలకు సెలవు..
మరోవైపు చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 12 వరకూ సెలవలు ప్రకటించామని విద్యాశాఖ మంత్రి అతిషి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నర్సరీ నుంచి 5వ తరగతి విద్యార్ధులకు చలి వాతావరణం కారణంగా రాబోయే ఐదు రోజులు ఢిల్లీలో స్కూల్స్ మూసివేస్తున్నట్టు అతిషి పేర్కొన్నారు. జనవరి 15న ప్రాధమిక తరగతుల విద్యార్ధులు తిరిగి స్కూల్కు వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ విద్యా ధాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్స్ తమ విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లు నిర్వహించవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
గడ్డకట్టిన దాల్ సరస్సు..
భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir) మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సు (Dal Lake)లో చలి తీవ్రతకు లోపలిభాగంలోని నీరు గడ్డకడుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
#WATCH | Srinagar, Jammu and Kashmir: A thin layer of fog seen on Dal Lake as cold wave continues. pic.twitter.com/nvf5TC2NMq
— ANI (@ANI) January 8, 2024
Also Read..
Yash | యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు మృతి
Chiranjeevi | రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తా : చిరంజీవి
Ayodhya Ram Mandir | అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఆలియా, రణ్బీర్లకు ఆహ్వానం