AP Elections | అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపొందుతుందని.. సైకో జగన్ ఇంటికి పోవడం ఖాయమని.. దానికితోడు ఇవాళ మేనిఫెస్టో అంటూ రాజీనామా కూడా చేసేశాడని, రాజకీయాలకు అస్త్రసన్యాసం చేశాడని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతుల తరఫున ప్రచారం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రశాంతి రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సూపర్ సిక్స్ ముందు జగన్ మేనిఫెస్ట్ వెలవెలబోయిందన్నారు. అందులో ఏముందని ప్రశ్నించారు. యువత, రైతులు, మహిళలకు ఏమైనా చెప్పాడా? అని ప్రశ్నించారు. దోచుకున్నంత దోచుకున్నా.. దాచుకున్నంత దాచుకున్నా… ఇప్పుడు చేతులెత్తేస్తున్నా అంటూ చేతులెత్తేసిన వ్యక్తి జగన్ అంటూ ఎద్దేవా చేశారు. అంటే దోపిడీ అనేది జగన్, రాజకీయాలంటే సేవ, సమాజానికి మంచి చేయాలనేది వేమిరెడ్డి కుటుంబం సిద్ధాంతమన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, పద్ధతి ఉండాలన్నారు. విలువలను పేటీఎం బ్యాచ్ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఈ అసెంబ్లీ కౌరవ సభ అని నాడే చెప్పానని.. మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి వచ్చానన్నారు. పెద్ద ఎత్తున అప్పులు చేసి నవరత్నాలు అన్నాడని.. నవమోసాలు చేశాడని విమర్శించారు.