జీడిమెట్ల, ఏప్రిల్ 27: చింతల్ డివిజన్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేవైఎం కన్వీనర్ సాయి రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.