చంఢీఘడ్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రైతు చట్టాలను వ్యతిరేకించి ఈ ఏడాది జనవరి 26వ తేదీన పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. గణతంత్య్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతులకు పంజాబ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ రోజున ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న 83 మంది రైతులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిలో ఒక్కొక్కరికి రెండేసి లక్షలు ఇవ్వనున్నట్లు పంజాబ్ సీఎం చరణ్జిత్ చన్నీ ప్రకటించారు. నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నదాతలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.