ముంబై : మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జైలులో రెండు రోజుల్లోనే 133 మంది ఖైదీలు కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేశారని అధికారులు తెలిపారు. శనివారం 35 మంది ఖైదీలకు పాజిటివ్ రాగా.. ఆదివారం మరో 98 మందికి వైరస్ సోకినట్లు తేలిందని చెప్పారు. వైరస్ సోకిన ఖైదీల్లో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. ఉస్మానాబాద్ జిల్లాలో ఆదివారం కొత్తగా 492 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 48,956కు చేరాయి. మహమ్మారి బారినపడి 1,114 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు 42,155 మంది బాధితులు కోలుకున్నారని అధికారులు చెప్పారు.