నార్కట్పల్లి, ఏప్రిల్ 26 : గంజాయిని రవాణా చేసినా, విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 39 కేసుల్లో రూ. 5.10 కోట్ల విలువైన 2,043 కేజీల గంజాయి పట్టుబడింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వాటిని శుక్రవారం జనావాసానికి దూరంగా ఉన్న నార్కట్పల్లి మండలం గుమ్మల్లబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద జిల్లా ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మంటల్లో కాల్చి నిర్వీర్యం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణాపై పోలీసుల నిరంతరం నిఘా ఉంటుంద తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బీ డీఎస్పీ రమేశ్, నల్లగొండ డీఎస్పీ పి. శివరాంరెడ్డి, డీసీఆర్బీడీ ఎస్పీ సైదా, సీఐ రాఘవరావు, భీమన్న, సైదులు, నాగరాజు, ఆర్ఐలు సూరప్పనాయుడు, సంతోష్, ఎస్ఐ అంతిరెడ్డి పాల్గొన్నారు.