లక్నో: ఉత్తరప్రదేశ్లోని జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరణించారు. మధురా జిల్లాలోని అలీగఢ్ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ వేపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఓ సీటీఓ, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అయితే విధుల్లో భాగంగా ఢిల్లీకి వెళ్తున్న అధికారులు మరణించడంతో.. ఇది యాక్సిడెంటా లేదా కావాలని చేసిన ప్రమాదమా అని అనుమానాలు వ్యక్తవమతున్నాయి. ఈ ఘటనపై పోలీసులతోపాటు వాణిజ్య పన్నుల శాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది.