కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బంగ్లాదేశ్కు చెందిన చొరబాటుదారులు హతమయ్యారు. వీరిని పశువుల స్మగ్లర్లుగా అనుమానిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించగా.. బీఎస్ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో స్మగ్లర్లు జవాన్లపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు.
దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరుపగా.. ఇద్దరు బంగ్లాదేశీయులు మృతి చెందారు. స్మగ్లర్లు సరిహద్దుల్లోని ఏర్పాటు చేసిన కంచెను దాటేందుకు ఇనుప రాడ్లను వినియోగిస్తున్నట్లు బలగాలు గుర్తించాయి. ఇదిలా ఉండగా.. బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచే అంశంపై ఇవాళ బెంగాల్లో చర్చ జరుగనున్నది. కేంద్రం హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచడం సహా పలు అంశాలపై బెంగాల్కు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.