Bomb Threats | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు బాంబు బెదిరింపులు (Bomb Threats) వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram temple)తో సహా సీఎంను పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న సమయంలో ఈ బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఈ బెదిరింపులతో అప్రమత్తమైన యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆధారంగా నిందితులు ఓం ప్రకాశ్, తాహర్ సింగ్గా గుర్తించారు. ఈ మేరకు ఆ ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. గోండాకు చెందిన వీరిద్దరూ పారామెడికల్ ఇనిస్టిట్యూట్లో పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
Also Read..
Houthis | ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు.. హౌతీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా సహా 12 దేశాలు
Ira Khan | వివాహబంధంలోకి అమీర్ ఖాన్ కూతురు.. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను మనువాడిన నుపుర్
Arvind Kejriwal | అవన్నీ వదంతులే.. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఈడీ.. !