Houthis | ఎర్ర సముద్రం (Red Sea)లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు చేస్తున్న హౌతీ రెబల్స్ (Houthi rebels)కు అమెరికా సహా 12 దేశాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి. దాడులు తక్షణమే ఆపకుంటే తమ మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఈ మేరకు 12 దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.
అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే దేశాలు ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా గతేడాది డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హౌతీ రెబల్స్ ఎర్రసముద్రంలో 23 సరకు రవాణా నౌకలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 12 దేశాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి.
Also Read..
Ira Khan | వివాహబంధంలోకి అమీర్ ఖాన్ కూతురు.. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను మనువాడిన నుపుర్
Arvind Kejriwal | అవన్నీ వదంతులే.. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఈడీ.. !
Sankranti Holidays | ఈ నెల 12 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎన్ని రోజులంటే?