న్యూఢిల్లీ, అక్టోబర్ 9: నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ నలుగురు కేంద్ర మంత్రులు సహా 18 మంది ఎంపీలను బరిలోకి దించింది. సోమవారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది.
మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ తన సంప్రదాయ బుధిని సీట్ నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ఫగ్గన్సింగ్ కులస్తే, ప్రహ్లాద్జోషి పటేల్ ఈ సారి మధ్యప్రదేశ్ నుంచి పోటీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం రమణ్ సింగ్ పేరు జాబితాలో కనిపించింది.