మక్తల్ రూరల్, జూలై 8 : మక్తల్ మున్సిపాలిటీలో పట్ట ణ ప్రగతిలో భాగంగా గురువారం 1వ వార్డులో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. అలాగే తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనులు, పారిశుధ్య పనులను పూర్తి చేశామని కౌన్సిలర్ శ్వేత తెలిపారు. ఆయా కాలనీల్లో ఉన్న కంపచెట్లను, వ్యర్థాలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. 3వ వార్డు చెన్నకేశవనగర్లో చెన్నరాయుడి ఆలయం ఎదు ట పాత బోరును మరమ్మతులు చేయించి, మోటర్ ఏర్పా టు చేసి కాలనీవాసులకు నీటి ఎద్దడి నివారించినట్లు కౌన్సిలర్ రాములు తెలిపారు. పనులను స్పెషల్ అధికారి సురేశ్ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజ య్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాయత్రి, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచాలి
ప్రతిఒక్కరూ తమ ఇం టి ఆవరణలో మొక్కలు పెంచాలని అదనపు కలెక్టర్ చం ద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని 2వ వార్డులో కౌన్సిలర్ అని త, మున్సిపల్ కమిషనర్ భాస్కర్రెడ్డితో కలిసి మొక్కలు నాటి నీళ్లుపోశారు. అనంతరం మహిళలకు పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జబ్బార్, నాయకులు, ఆర్పీ ప్రమీల, అంగన్వాడీ టీచ ర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. 10వ వార్డులో కౌన్సిలర్ మే ఘ కులకర్ణి, ప్రత్యేక అధికారి నాగరాజ్ మహిళలకు పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని వారు సూచించా రు. 4వ వార్డులో కౌన్సిలర్ జయశ్రీ పర్యవేక్షణలో జేసీబీతో ముళ్లకంపలను తొలగింపజేశారు. అనంతరం ఖాళీ స్థలా ల్లో మొక్కలు నాటారు. వివిధ వార్డుల్లో ఆయా వార్డుల కౌ న్సిలర్లు, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కంపచెట్లను తొలగించి మురుగునీటి కాల్వలను శుభ్రం చేయించారు.
సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి పనులు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ము మ్మరంగా సాగుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా పిచ్చి మొక్కల తొలగింపు, డ్రైనేజీ లు, రోడ్లను శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. పట్టణ ప్రగతిలో భాగంగా బల్దియాలోని అన్ని వార్డుల్లో ప్రత్యేకాధికారులు పనులు చేయిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో భా గంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి గుండుమల్లో పల్లె నిద్ర చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.