న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీల(Medical Colleges) భవిష్యత్తు ప్రశ్నార్ధకంలో పడింది. ఆ కాలేజీల అనుమతి రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అరకొర వసతులతో ఆ కాలేజీలు నడుస్తున్నాయని, రూల్స్ విరుద్ధంగా ఆ కాలేజీలు ఉన్నట్లు జాతీయ మెడికల్ కమీషన్ పేరన్కొన్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 మెడికల్ కాలేజీలు తమ గుర్తింపును కోల్పోయినట్లు ఎన్ఎంసీ తెలిపింది. గుర్తింపు కోల్పోయే మెడికల్ కాలేజీలు ఎక్కువ శాతం గుజరాత్, అస్సాం, పుదుచ్చరి, తమిళనాడు, పంజాబ్, ఏపీ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి.
ఇటీవల అండర్గ్రాడ్యువేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన తనిఖీల్లో మెడికల్ కాలేజీల గురించి తెలిసింది. సీసీటీవీ కెమెరాలు, ఆధార్ కార్డు లోపాలు, బయోమెట్రిక్ హాజరు, బోధనా సిబ్బంది సరిగాలేకపోవడం లాంటి అంశాలను కూడా గుర్తించారు. అయితే గుర్తింపు రద్దు విషయంలో మెడికల్ కాలేజీలు తమకు 30 రోజుల్లోగా అభ్యర్థన చేసుకోవచ్చు అని ఎన్ఎంసీ తెలిపింది. ఒకవేళ ఆ అభ్యర్థనను తిరస్కరిస్తే, వాళ్లు కేంద్ర ఆరోగ్యశాఖను సంప్రదించవచ్చు.