Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మంది గాయాలపాలయ్యారు.
కవార్ధా (Kawardha)లో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ (tendu leaves) కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ కుక్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహపానీ (Bahpani) గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సుమారు 25 మంది గాయాలపాలయ్యారు.
ప్రమాద సమయంలో వాహనంలో 35 నుంచి 45 మందిదాకా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
Alwal | భార్య బారి నుంచి కాపాడండి..! పోలీసులకు ఓ భర్త వేడుకోలు..
Loksabha Elections 2024 | ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్