Alwal | తన భార్య నిత్యం కొడుతుందని.. ఆమె నుంచి తనతో పాటు తల్లిదండ్రులకు ప్రాణ హాని ఉందని.. తమను కాపాడాలంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని అల్వాల్లో చోటు చేసుకున్నది. పెళ్లయిన నాటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నదంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఒంటిపై గాయాలను చూపుతూ మీడియా ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్కు అమలాపురానికి చెందిన లక్ష్మి గౌతమితో ఏడేళ్ల కిందట పెళ్లి జరిగింది. టెమూజిన్ మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. పెళ్లయిన నాటి నుంచి భార్య తనను అకారణంగా హింసిస్తుందని.. పలుమార్లు పెద్దల సమక్షంలో మాట్లాడినా తీరు మారడం లేదన్నారు.
ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసిందని చెప్పాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపాడు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఓ చట్టం, పురుషులకు ఓ చట్టం ఉంటుందా? అంటూ ప్రశ్నించాడు. తాను నిన్నటి నుంచి ఇంటికి వెళ్లలేదని.. వెళ్లే మళ్లీ భార్య తనపై దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు భార్యపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షించాలని వేడుకున్నాడు. అయితే, భర్త ఆరోపణలను భార్య ఖండించింది. ఆరోపణలన్నీ అవాస్తమని.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఇందులో నిజానిజాలు ఏంటో విచారణ చేయాలని కోరింది. తాను దాడి చేశానని చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదని తెలిపింది.
భర్తను రోజూ కొడుతున్న భార్య.. పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్న భర్త
తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని… రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు.
పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు ఆల్వాల్ పోలీస్ స్టేషన్… pic.twitter.com/fpC4G5ACYy
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2024