Loksabha Elections 2024 : దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. పెద్దసంఖ్యలో సామాన్యులు, సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మరోవైపు బాలీవుడ్ దిగ్గజ దర్శకులు డేవిడ్ ధావన్, నటుడు వరుణ్ ధావన్ ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వారు తమ వేలికి ఇంక్ గుర్తును ప్రదర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరూ పాలుపంచుకోవాలని వారు కోరారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు షారుక్ ఖాన్, చుంకీ పాండే, అనన్యా పాండే సహా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం, ఎన్నికల ప్రచారకర్త సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సైతం ఓటు వేశారు. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar)తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు.
Read More :
Auto Drivers | కిస్తీ కడ్తవా? చస్తవా?.. ఆటోడ్రైవర్లకు ఫైనాన్షియర్ల తీవ్ర వేధింపులు