బెంగళూరు: కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్)- జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) కాంగ్రెస్పై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 15 మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరుతారని అన్నారు. చిత్రదుర్గ మాజీ శాసన మండలి సభ్యుడు రఘు ఆచార్ ఇప్పటికే తనతో మాట్లాడారని, జేడీఎస్లో చేరతానని స్వయంగా చెప్పినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్కు చెందిన 15 మంది నేతలు జేడీఎస్లో చేరుతారని అన్నారు. ‘గతంలో జేడీఎస్ను ముంచేందుకు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకెళ్లింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జేడీఎస్లోకి వస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. జేడీఎస్ అభ్యర్థుల రెండో జాబితాను సోమవారం విడుదల చేస్తామని కుమారస్వామి వెల్లడించారు.
మరోవైపు, మాజీ ఎంపీ, బహిష్కృత జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు ఎల్ఆర్ శివరామే బుధవారం బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, జేడీఎస్లో అంతర్గత రాజకీయాలు, ఘర్షణలు ఎక్కువని విమర్శించారు. సూచనలను బహిరంగంగా వ్యక్తీకరించే హక్కు కూడా ఉండదని అన్నారు. అందుకే యూత్ కాంగ్రెస్ లీడర్ అయిన తాను తొలుత కాంగ్రెస్ను, తర్వాత జేడీఎస్ను వీడి బీజేపీలో చేరినట్లు చెప్పారు. రాబోయే 10 రోజుల్లో ఇంకా చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతారని తెలిపారు. కర్ణాటకలో మెజారిటీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.
Also Read: