జైపూర్ : రాజస్దాన్ సీఎం అశోక్ గెహ్లోట్పై రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజస్ధాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజె అవినీతిలో అశోక్ గెహ్లోట్ ప్రమేయం ఉందని పైలట్ ఆరోపించారు.
అవినీతి కేసుల్లో వసుంధర రాజెపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడాన్ని సచిన్ పైలట్ తప్పుపట్టారు. వసుంధర రాజె హయాంలో జరిగిన అవినీతిపై అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ అవినీతిలో ఆయన భాగస్వామ్యంపై తమ ప్రత్యర్ధులు ప్రశ్నిస్తారని పైలట్ వ్యాఖ్యానించారు.
విపక్షంలో ఉన్నప్పుడు తాము గట్టిగా పోరాడటం వల్లే అధికారంలోకి రాగలిగామని గుర్తుచేశారు. విపక్షంలో ఉండగా వసుంధర రాజె సర్కార్ అవినీతి ఉదంతాలను లేవెనెత్తామని పేర్కొన్నారు. విపక్షంలో ఉండగా మనం చేసిన ఆరోపణలపై స్పందించి చర్యలు చేపడితేనే మన విశ్వసనీయత నిలబడుతుందని పైలట్ అన్నారు.
Read More