భువనేశ్వర్ : ప్రాజెక్ట్ టైగర్ 50 ఏండ్ల ప్రస్ధానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బండిపుర టైగర్ రిజర్వ్ సందర్శనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హెడ్లైన్స్లో మెరిసినా వాస్తవం మాత్రం పూర్తి విరుద్ధంగా ఉందని పేర్కొంది. బండిపురలో 50 ఏండ్ల కిందట ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైతే ఈ ఘనతను ప్రధాని మోదీ ఈరోజు ఆ ఘనతను తన ఖాతాలో వేసుకోవచ్చు.
అయితే పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణలు, గిరిజనుల హక్కుల కోసం తీసుకువచ్చిన చట్టాలు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. బండిపురలో ప్రధాని మోదీ హంగామాతో హెడ్లైన్స్లో నిలిచినా వాస్తవ పరిస్ధితి మాత్రం పూర్తి భిన్నంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఇక ప్రధాని మోదీ ఆదివారం బండిపుర టైగర్ రిజర్వ్ను సందర్శించారు.
ఆయన ఖాకీ ప్యాంట్స్, అడ్వంచర్ స్లీవ్లెస్ జాకెట్తో కూడిన టీ షర్ట్ ధరించారు. భారత్లోని ప్రముఖ పులుల అభయారణ్యాల్లో ఒకటైన బండిపుర టైగర్ రిజర్వ్లను సందర్శించిన తొలి ప్రధాని మోదీ కావడం గమనార్హం. అమృత కాలంలో పులుల సంరక్షణ కోసం ప్రభుత్వ విజన్ను ఈ సందర్భంగా ప్రధాని విడుదల చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబీసీఏ)ను ప్రారంభిస్తారు.
Read More
Face masks | పెరుగుతున్న కరోనా కేసులు.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసిన మూడు రాష్ట్రాలు