లక్నో: ఉత్తరప్రదేశ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. బుధవారం పిడుగుపాటు వల్ల 14 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. అత్యధికంగా బాందా జిల్లాలో నలుగురు మరణించారని చెప్పారు.
కాగా, పిడుగుపాటుతో 14 మంది మరణించడం పల్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలు సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.