Maoists : ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బీజాపూర్ జిల్లా (Bijapur district) లో 13 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.23 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
కగార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఎన్కౌంటర్లలో కీలక నేతలు మరణించారు. ఈ నేపథ్యంలో కొందరు మావోయిస్టులు అజ్ఞాతం వీడుతున్నారు. పోలీసుల ముందు లొంగిపోతున్నారు.