న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోమారు పంజా విసిరింది. దీంతో ఢిల్లీలో మహమ్మారి బారినపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. కరోనా కేసులు రెట్టింపు కావడంతో రాష్ట్రంలో రెండు రోజుల్లోనే 12 వందలకుపైగా కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. దీంతో దేశరాజధానిలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 9929కి చేరాయి. ఢిల్లీలో నిన్న రాత్రి వరకు 19,486 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా రోగులకు ఆక్సిజన్ బెడ్లతో కూడిన సదుపాయాలు కల్పించాలని సీఎం కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు.
ఏప్రిల్ 14 నాటికి రాష్ట్రంలో 8661 కంటైన్మెంట్ జోన్లు ఉండగా, శుక్రవారం సాయంత్రానికి వాటి సంఖ్య 9929కి పెరిగింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో కొత్తగా 1268 కంటైన్మెంట్ జోన్లు చేరాయి. ఈ నేపథ్యంలో వైరస్ను నిలువరించడానికి ఢిల్లీలో నేటి నుంచి వారాంతపు కర్ఫ్యూ ప్రారంభంకానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి