న్యూఢిల్లీ : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో నిన్న జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో 125 ఏండ్ల యోగా గురువురు స్వామి శివానంద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. పద్మ శ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద పేరును పిలవగానే ఆయన తన చైర్లో నుంచి లేచి.. వినయంగా మోదీ వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. మోదీ కూడా వంగి ప్రతి నమస్కారం చేశారు. అక్కడ్నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లిన స్వామి శివానంద ఆయన పాదాలకు కూడా నమస్కరించారు. రాష్ట్రపతి కూడా ఆ పెద్ద మనిషిని గౌరవించి, పద్మ శ్రీ అవార్డును అందజేశారు. ఈ సమయంలో అక్కడున్న వారంతా లేచి నిలబడి, స్వామి శివానందకు కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలిపారు.
స్వామి శివానంద తెలుపు రంగు కుర్తా, ధోతీ ధరించారు. చెప్పులు లేకుండా ఓ సామాన్యుడిలా అవార్డును స్వీకరించారు. స్వామి శివానంద తన జీవితాన్ని మొత్తం సమాజ సేవకు అంకితం చేశారు. 1896, ఆగస్టు 8న అవిభాజ్య భారత్లోని సిల్హెత్ జిల్లా(ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది)లో శివానంద జన్మించారు. ఆరేండ్ల వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయారు. పేదరికం వల్ల ఆకలితో అలమటించారు. ఈ క్రమంలో అనాథగా ఉన్న శివానందను పశ్చిమ బెంగాల్లోని గురూజీ ఆశ్రమంలో చేర్పించారు. గురు ఓంకారనంద గోస్వామి.. శివానందను పెంచి పెద్ద చేశారు. ఆధ్యాత్మిక బోధనలతో పాటు యోగాను శివానందకు గోస్వామి నేర్పించారు. ఈ క్రమంలో నిత్యం యోగా సాధన చేసే శివానంద 125 ఏండ్ల వయసులోనూ చలాకీగా ఉన్నారు. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న అత్యంత వృద్ధుడిగా శివానంద రికార్డు సృష్టించారు.
So heart touching 😢
125 Year old Yoga Guru from Kashi, Swami Sivananda receives Padma Shri for his immense contribution in the field of #Yoga#PadmaAwards #PeoplesPadma #PadmaAwards2022 #PadmaShri pic.twitter.com/1PKLHzezOT— Kiren Rijiju (@KirenRijiju) March 21, 2022