భోపాల్: ఒక విద్యార్థినిపై నాలుగు కార్లలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి బెదిరించడంతోపాటు డబ్బుల కోసం ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Girl Gangraped) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. ఒక బాలిక 11వ తరగతి చదువుతున్నది. పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు నాలుగు కార్లలో పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాలికపై లైంగిక దాడిని ఒక వ్యక్తి ఐఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను ఆమెకు షేర్ చేశారు. రూ.40,000 ఇవ్వాలని ఆ బాలికను వారిద్దరూ బ్లాక్మెయిల్ చేశారు. లేకపోతే దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు.
మరోవైపు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రధాన నిందితుడు ఆసఫ్ అలీ ఖాన్, అతడి అనుచరుడు మేజ్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. థార్ ఎస్యూవీతో సహా నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే మేజ్ ఖాన్ వీడియో రికార్డ్ చేసిన ఐఫోన్ స్వాధీనం కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడితో సంబంధాలున్న హెడ్ కానిస్టేబుల్ కీలక సమాచారం లీక్ చేయడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Woman Kills Mother | చేతబడి వల్ల తండ్రి మరణించాడన్న జ్యోతిష్కుడు.. తల్లిని చంపిన కుమార్తె
Watch: రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు
Watch: ఐదుగురిపైకి కారు దూకించిన విద్యార్థి.. ఆరేళ్ల బాలుడు మృతి