Bus Accident | కేరళ రాష్ట్రం కోజికోడ్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది (Bus Accident). కేరళ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది. చెరువన్నూరు వద్ద జాతీయ రహదారిపై ట్రక్కును ఢీ కొట్టింది (bus collides with truck). ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
కేఎస్ఆర్టీసీ (KSRTC)కి చెందిన బస్సు శనివారం ఉదయం కొట్టారక్కర నుంచి సుల్తాన్ బతేరీకి వెళ్తోంది. ఈ క్రమంలో చెరువన్నూరు హయ్యర్ సెకండరీ పాఠశాల సమీపంలోకి రాగానే కంటైనర్ లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోయస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కాగా, ప్రస్తుతం ఆ ప్రాంతంలో మోస్తరు వర్షం కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రోడ్డు జారే పరిస్థితి కారణంగా ప్రమాదానికి దారితీసినట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read..
Siddaramaiah | మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు
Rahul Gandhi | స్టాలిన్ కోసం మైసూర్పాక్ కొన్న రాహుల్.. వీడియో