కోయంబత్తూర్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఈసారి ఎలాగైనా ఇండియా కూటమిని కేంద్రంలోకి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సింగనళ్లూరులో ప్రచారం నిర్వహించిన ఆయన.. రాత్రి పొద్దుపోవడంతో విరామం తీసుకున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ఓ స్వీట్ షాప్లోకి వెళ్లి అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచారు.
డివైడర్ దాటుకుని రోడ్డుకు అవతలివైపున్న స్వీట్ దుకాణానికి వెళ్లిన ఆయన.. ఇక్కడ ఫేమస్ స్వీట్ ఏంటని అందులో ఉన్నవారిని అడిగారు. మైసూర్పాక్ అని చెప్పడంతో తమిళనాడు సీఎం స్టాలిన్ కోసం దానిని కొనుగోలుచేశారు. అనంతరం తనకు అత్యంత ఇష్టమైన గులాబ్ జామ్ను అక్కడే ఆరగించారు. షాపు సిబ్బందితో ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లిన రాహుల్.. ఆయనకు మైసూర్పాక్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#RahulGandhi = Wholesome😍🥹🫶✨#RahulGandhiHopeOfIndia #RahulGandhiVoiceOfIndia pic.twitter.com/WYIdihesuw
— Kanimozhi Manoharan (@Kaniiii___) April 12, 2024
இப்படி ஒரு மனுஷன் பிரதமர் ஆனால் மட்டுமே இந்த நாடு செழுமையாக இருக்கும் 🥰❤️
இந்திய மக்களே ஒருமுறை இவருக்கு வாய்ப்பளித்து பாருங்க🙏#RahulGandhi #Vote4INDIApic.twitter.com/wwdVu46Im6
— ஜீரோ நானே⭕ (@Anti_CAA_23) April 12, 2024