వీణవంక, జూన్ 29: దేశంలో మరెక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిగెలు అని విమర్శించడం ఈటల రాజేందర్ అహంకారానికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ఈటల రాకముందే కమలాపూర్ టీఆర్ఎస్కు కంచుకోటని స్పష్టంచేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్, హుజూరాబాద్ మండలం సింగాపూర్, చెల్పూర్ గ్రామాల్లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు వేదికలు అన్నదాతలకు నిత్య శిక్షణా కేంద్రాలని అభివర్ణించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీసీ కమిషన్ మాజీసభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్రావు పాల్గొన్నారు.
రైతుల గురించి ఆలోచన చేసింది సీఎం కేసీఆరే: ఎమ్మెల్సీ పల్లా
రైతుబంధు వద్దన్న ఈటల రాజేందర్ ఇన్ని రోజులు రూ.లక్షలు ఎలా తీసుకున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. రైతుల గురించి ఆలోచన చేసింది సీఎం కేసీఆరేనని, పెట్టుబడితోపాటు రైతు చనిపో తే రూ.5 లక్షలు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని పునరుద్ఘాటించారు.