న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న విషయం తెలిసిదే. పెగాసస్ అంశం, సాగు చట్టాల రద్దు లాంటి అంశాలపై చర్చ చేపట్టాలని పట్టుపడుతున్నాయి. అయితే ఇవాళ కూడా లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఓ దశలో కొందరు విపక్ష ఎంపీలు చైర్పైకి పేపర్లు విసిరేశారు. ఈ ఘటన పట్ల స్పీకర్ ఓం బిర్లా సీరియస్గా ఉన్నారు. పది మంది ఎంపీలపై ఆయన వేటు వేశారు. సస్పెన్షన్కు గురైన ఎంపీల్లో మానికం ఠాగూర్, డీన్ కురియకోజ్, హిబ్బి హిడన్, జోయిమని, రవనీత్ బిట్టు, గుర్జీత్ ఔజ్లా, ప్రతాపన్, వైథిలింగం, సప్తగిరి శంకర్, ఏఎం ఆరిఫ్, దీపక్ బైజ్లు ఉన్నారు. చైర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు రూల్ 374(2) ప్రకారం పది మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరైనా సభ్యులు భవిష్యత్తులో ఇలాగే ప్రవర్తిస్తే, వారిని లోక్సభ టర్మ్ మొత్తం బహిష్కరించనున్నట్లు స్పీకర్ బిర్లా వార్నింగ్ ఇచ్చారు.