బరోడా: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందారు. ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం పట్ల పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మృతదేహాలను తారాపూర్ దవాఖానకు తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన పది మంది కారులోనే ప్రయాణిస్తున్నారు. వేగంగా వస్తున్న ట్రక్కును ఆ కారు ఢీకొనడంతో ఈ విషాదం నెలకొన్నది. కారులో ఉన్న పది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో ఓ చిన్నారి కూడా ఉన్నారు. వటామన్ మార్గంలో కారు ప్రయాణిస్తుండగా.. ఎదురు రూట్లో ట్రక్కు వస్తోంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.