చెన్నై, ఫిబ్రవరి 17: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణసం చా ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడులో పదిమంది సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. వెంబకోైట్టె బ్లాక్లోని రాముదేవన్పట్టిలోని కర్మాగారంలోని శనివారం మధ్యాహ్నం ఫ్యాన్సీ క్రాకర్స్ కోసం కార్మికులు రసాయనాలు కలుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీశారు. నిబంధనల ప్రకారం రసాయనాలు కలుపుతున్నప్పుడు ఆ గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. కానీ ఆ సమయంలో 8 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఘటన తర్వాత కనిపించకుండా పోయిన ఫ్యాక్టరీ యజమాని, మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.