Ayodhya Ram Temple | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) నిర్మాణ పనులు
శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మందిరాన్ని చూసేందుకు యావత్ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది జనవరి చివరి కల్లా ఆ ఆలయంలోకి భక్తులను అనుమతించున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. రామమందిరంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది
జనవరి 14 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 25వ తేదీ నుంచి రాముడిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించనున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా కడుతున్న భవ్య రామ మందిరం నిర్మాణం కోసం పలువురు భక్తులు తమ వంతు
సాయం చేస్తూ.. రాముడిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. వారికి తోచిన సాయం చేస్తున్నారు. డబ్బు, వస్తు రూపంలో కానుకలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ భక్తుడు భవ్య రామ మందిరం కోసం బాహుబలి తాళాన్ని తయారు చేశాడు. 400 కిలోల బరువున్న తాళాన్ని తయారు చేసి రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. తాళాల నగరంగా పేరున్న ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని అలీగఢ్ (Aligarh) కు చెందిన సత్య ప్రకాశ్ శర్మ (Satya Prakash Sharma) రాముడికి అపరమైన భక్తుడు. అతను వృత్తిరీత్యా తాళాల తయారీలో నిపుణుడు. అతడి కుటుంబం 100 సంవత్సరాలకు పైగా తాళాల తయారీ పనులు చేస్తోంది. ఇందులో భాగంగానే అయోధ్య రామాలయం కోసం సత్యప్రకాశ్ శర్మ కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారుచేసిన తాళాన్ని (world largest handmade lock) సిద్ధం చేశాడు. దీనిని త్వరలోనే అయోధ్యలో రామాలయ అధికారులకు అందజేయనున్నాడు.
‘అయోధ్య ఆలయాన్ని దృష్టిలో ఉంచుకుని పది అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని, నాలుగు అడుగుల చెవిని తయారు చేశాను. ఈ తాళాన్ని ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వార్షిక అలీగఢ్ ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం తాళానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు, వివిధ రకాల అలంకరణలు చేస్తున్నాను. ఈ తాళం తయారీలో నా భార్య రుక్మిణి ఎంతగానో సహకరించింది. ఈ తాళం తయారీకి రూ.2 లక్షలు వెచ్చించించాం’ అని సత్యప్రకాశ్ శర్మ తెలిపారు.
Also Read..
Rahul Gandhi | ఎంపీగా తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న రాహుల్.. అనర్హతను ఎత్తివేసిన దిగువ సభ
Bus Accident | ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృతి
CM KCR | ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం గద్దర్ పేరు నిలిచిపోతుంది: సీఎం కేసీఆర్